YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తహశీల్దార్ సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్

తహశీల్దార్ సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్

తహశీల్దార్ సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్
హైద్రాబాద్
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి ఆఫీసులోనే సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదమే ఆమె హత్యకు కారణమని తెలుస్తోంది. అక్రమ భూదందాల వ్యవహరంతో.. రైతులు విసిగిపోయారని తెలుస్తోంది. గౌరెల్లి గ్రామంలోని 412 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘గౌరెల్లి ప్రాంతానికి చెందిన రైతులు నిజాం హయాంలో 412 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 1950లలో పాస్‌బుక్‌లు ఇచ్చారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి.. ఈ భూమి నాదంటూ కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగేవారు. దీంతో వివాదాలు తలెత్తాయి. చిన్న చిన్న లొసుగులను చూపి బెదిరిస్తూ భూములను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద అంబర్ ‌పేట ప్రాంతంలోనూ 402 ఎకరాలకు సంబంధించి కూడా ఇలాగే వివాదం మొదలైంది. 1955లో రైతులు భూమిని కొనుగోలు చేయగా.. 1976 దాకా వారి పేరిటే ఉంది. తర్వాత కూడా వారిపేర్లు ఉన్నాయి ఓఆర్సీలు కూడా ఇచ్చారు. కానీ ఆ ఏడాది రౌండప్ చేసి ఓ ముస్లిం వ్యక్తి పేరు రాశారు.దీంతో మాకు తెలియకుండా ఓఆర్సీ ఇచ్చారని ముస్లిం వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసులో హోం మంత్రి మహమూద్ అలీ కొడుకు ప్రమేయం కూడా ఉంది. గౌరెల్లి, పెద్ద అంబర్‌పేట భూముల వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలి.ఈ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది. రైతుల దగ్గర్నుంచి ఆయన రూ.30 లక్షలు తీసుకున్నారు. ఎమ్మార్వోను హత్య చేసిన వ్యక్తి కూడా ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చాడు’’ అని ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన సంభాషణ భూదందాలు జరుగుతున్న తీరుకు అద్దం పడుతోంది.
నా భర్తను వాడుకున్నారు : సురేశ్ భర్త లత
తన భర్తను ఎవరో పావులా వాడుకున్నారని తహశీల్దార్ హత్య కేసులో నిందితుడు కూర సురేశ్ భార్య లత ఆరోపిస్తోంది. తన భర్త ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని.. చాలా అమాయకుడని చెబుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయా రెడ్డిపై దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేశ్‌కు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడే ఉన్న నిందితుడి భార్య లత.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హత్యోదంతంపై తొలిసారిగా స్పందించింది.వివాదానికి సంబంధించిన భూమి విషయమే తమకు తెలియదని లత చెప్తోంది. తన భర్త సురేశ్ ఇటీవల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరుగుతున్నాడని.. అప్పటి నుంచే సదరు భూమి విషయం తెలిసి ఉండొచ్చని చెప్పింది. ఉన్న పొలం అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనుకుంటున్న సమయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె కన్నీరు పెట్టింది.తన భర్తకు ఎవరో నూరిపోసి ఇదంతా చేయించారని లత చెబుతోంది. పూర్తి విచారణ జరిపించి ఘటన వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ఆమె కోరుతోంది. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సురేశ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మంగళవారం నాటితో పోలిస్తే బుధవారానికి అతడి ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపారు. అతడిని విచారించే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు ఇతర అంశాలపై దృష్టి సారించారు.ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన అనంతరం నిందితుడు సురేశ్ కాలిన గాయాలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాడిలో మంటలు అంటుకోవడంతో సురేశ్.. తహశీల్దార్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుకొచ్చాడు. ఆ తర్వాత తన ప్యాంట్, షర్ట్ విప్పేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ ముందు కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 

Related Posts