YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తహసిల్దార్ సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ మృతి

తహసిల్దార్ సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ మృతి

తహసిల్దార్ సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ మృతి
హైదరాబాద్
అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తహసిల్దార్ విజయ రెడ్డి ని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కేసులో తీవ్రంగా గాయ పడి చికిత్స పొందుతున్న నిందితుడు సురేష్ ముదిరాజ్ గురువారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రి లో మృతి చెందాడు. భూవివా దంలో పట్టా పాస్ బుక్ చేయడం లేదని నాలుగు రోజుల క్రితం నిందితుడు సురేష్ తహసిల్ కార్యాల యంలో విధులు నిర్వహిస్తున్న విజయా రెడ్డి పై కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన సంఘటన తెలిసిందే.ఈ సంఘటనలో తాసిల్దార్ విజయ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా ఆమె డ్రైవర్ గురునాథం, చికిత్స పొందుతూ మృతి చెందగా, 65 శాతం కాలిన చికిత్స ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నింది తుడు సురేష్ మృతి చెందాడు. సురేశ్ కు  చివరివరకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు.. దాదాపు 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్కు నిన్న రాత్రి ఏడు గంటల నుంచి శ్వాసతీసుకోవడం ఇబ్బంది అయిందని  వైద్యులు పేర్కొన్నారు.

Related Posts