YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గర్భగుడిలోని టీటీడీ సిబ్బంది తీరు బాగాలేదు

గర్భగుడిలోని టీటీడీ సిబ్బంది తీరు బాగాలేదు

గర్భగుడిలోని టీటీడీ సిబ్బంది తీరు బాగాలేదు
తిరుమల 
గర్భగుడిలోని టీటీడీ ఉద్యోగులు తీరు స్వామివారి ప్రశాంతతకు భంగం కలిగి భక్తుల దర్శనం భాగ్యం సవ్యంగా సాగడం లేదని మాజీ మంత్రి రామచంద్రయ్య అన్నారు.తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆంధ్రప్రదేశ్ మంచి పరిపాలనతో ముందుకు సాగుతుందన్నారు. జలాశయలు నిండుగా ఉండటం వల్ల ప్రస్తుతానికి ఇసుక కొరత ఏర్పడిందన్నారు. ఇసుక సమస్యకూడా త్వరలోనే ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని తెలిపారు. టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అన్ని బాగున్నాయన్నాని, కానీ గర్భ గుడిలో ఉన్న టీటీడీ ఉద్యోగుల హడావుడి కారణంగా భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోలేక పోతున్నారన్నారు.దీనిపై టీటీడీ అధికారులు దృష్టి సారించి భక్తులకు స్వామి వారి దివ్యదర్శనం కలిగేలా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందని చెప్పారు.

Related Posts