YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

హత్య కేసులో నిందితుడి ఆరెస్టు

హత్య కేసులో నిందితుడి ఆరెస్టు

హత్య కేసులో నిందితుడి ఆరెస్టు
కర్నూలు 
కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన మర్డర్ ఉదాంతాన్ని పోలీసులు చేధించారు. పొలం కోసం  పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కొడవులతో దాడి చేసి హత్య చేశారు. పెద్దకొట్టాల చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది. భూ విక్రయాల్లో తలెత్తిన వివాదాలు కారణంగా హత్య చేసేందుకు కుట్ర చేశారు. ఈయనకు 22 ఎకరాల పొలం ఉంది. దానిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. 2004లో అదే గ్రామానికి చెందిన మద్దిలేటి రెడ్డి వద్ద  ఎకరా 2 లక్షల చొప్పున రెండెకరాల పొలం ఆయన కొనుగోలు చేశాడు. తర్వాత భూముల ధరలు భారీగా పెరగడంతో   తన పొలం తిరిగి ఇవ్వాలని 2013లో మద్దిలేటిరెడ్డి పట్టుబట్టారు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో  పంచాయితీ ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. సమస్యను కోర్టులో తెల్చుకోవాలని పోలీసులు సూచించడంతో వారు కోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు తీర్పు పెద్దారెడ్డికి అనుకూలంగా రావడంతో మద్దిలేటిరెడ్డి కక్ష పెంచుకున్నాడు.  ఎలాగైనా తన పొలాన్ని తిరిగి దక్కించుకోవాలని వివిధ కుట్రలు పన్నాడు. ముందుగా తన భార్య సూర్యకాంతం పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేశాడు.  తర్వాత  పొలానికి వెళ్తుండగా వెంబడించి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టించాడు. అయినా, పెద్దారెడ్డి ప్రాణాలతో బయటపడటంతో ఈసారి హత్యకు  ప్లాన్‌ వేసి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెష్టు చేసి వేట కొడవలను స్వాదీనం చేసుకున్నారు.

Related Posts