YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సిట్ కు బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

సిట్ కు బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

సిట్ కు బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
విశాఖపట్నం 
విశాఖ భూ కుంభకోణం పై ప్రభు త్వం ఆదేశించిన సిట్ దర్యాప్తు తుది దశకు చేరుతోంది. ఈ క్రమంలో నగరంలోని మధుర వాడలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ  బీజపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు సిట్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణకు కొద్ది రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఆశ్రయించి కబ్జాదారులు భూములను మింగేస్తున్నారని ఆరోపించారు. సిట్‌ ద్వారా ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములపై కూడా విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

Related Posts