YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దుర్మార్గపు పాలన

దుర్మార్గపు పాలన

దుర్మార్గపు పాలన
విశాఖపట్నం నవంబర్ 8 
టిడిపి ప్రభుత్వం  పేదలకు మంజూరు చేసి, గృహ ప్రవేశాలకు సిద్ధముగా ఉన్న గృహాలను నిలుపుదల చేయడం చాలా అన్యాయమని వెంటనే మంజూరైన లబ్ధిదారులకు గృహాలను కేటాయించాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెందుర్తి మండల కార్యాలయం వద్ద బలహీన వర్గాల ఇల్లు నిలుపుదలపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను రద్దు చేయడం సిగ్గుచేటని ధ్వజ మెత్తారు. ఏవైతే లబ్ధిదారులకు మంజూరైన గృహాలు ఉన్నాయో వాటిని వారికే అప్పజెప్పాలని లేనిపక్షంలో  పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో  టిడిపి నాయకులు కరక దేవుడు, కొట్టానా అప్పారావు, దాట్ల మధు, గుంత కోరు మాధవరావు, గంట్ల పెంటారావు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts