YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం అనాలోచిత చర్యలతో విసిగెత్తిపోతున్నప్రజలు: బీజేపీ

ప్రభుత్వం అనాలోచిత చర్యలతో విసిగెత్తిపోతున్నప్రజలు: బీజేపీ

ప్రభుత్వం అనాలోచిత చర్యలతో విసిగెత్తిపోతున్నప్రజలు: బీజేపీ
గుంటూరు నవంబర్ 8 
రాష్ట్ర ప్రభుత్వానికి దశ దిశ ఉన్నాయో లేవో అర్థం కానీ పరిస్థితి ఏర్పడిందని ఏపీ బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జూపూడి రంగరాజు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత చర్యలతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ఇసుక కొరత, రివర్స్ టెండరింగ్ విధానాలే అందుకు నిదర్శనమన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు దేని కోసమైతే పోరాడారో దానిని వైసీపీ ప్రభుత్వం తుంగలోకి తోక్కుతోందని ఆరోపించారు. ఆంగ్ల భాషలో విద్యాబోధన అనేది మంచి పద్ధతి కాదని, దానిని తాము ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఉరుకొమన్నారు. ప్రజలకు మేలు చేకూరే పనులు చేయలే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని రంగరాజు సూచించారు.

Related Posts