YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మిలియన్ మార్చ్ లాగే ఆర్టీసీ ట్యాంక్ బండ్ సక్సెస్ అవుతుంది   ఎల్లకాలం కేసీఆరే అధికారంలో ఉండడని గుర్తుంచుకోవాలి   కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మిలియన్ మార్చ్ లాగే ఆర్టీసీ ట్యాంక్ బండ్ సక్సెస్ అవుతుంది   ఎల్లకాలం కేసీఆరే అధికారంలో ఉండడని గుర్తుంచుకోవాలి    కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మిలియన్ మార్చ్ లాగే ఆర్టీసీ ట్యాంక్ బండ్ సక్సెస్ అవుతుంది
  ఎల్లకాలం కేసీఆరే అధికారంలో ఉండడని గుర్తుంచుకోవాలి
              కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 8
 తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఎలా జరిగిందో.. ఆర్టీసీ జాక్ ట్యాంక్ బండ్ కార్యక్రమం కూడా అలాగే సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. పోలీసులు రాష్ట్రంలో భయాన్ని సృష్టిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీసు అధికారులు జాగ్రత్త వహించాలని, ఎల్లకాలం కేసీఆర్ కుటుంబమే అధికారంలో ఉండదని అన్నారు.కాంగ్రెస్ కానీ.. బీజేపీ గానీ అధికారంలోకి వస్తే.. పక్షపాతంగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులకు ఇబ్బందులు తప్పవని జగ్గారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకున్నా.. న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకున్నా.. కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులతో భయాందోళన సృష్టిస్తున్నారని, కాంగ్రెస్‌ లేదా బీజేపీ అధికారంలోకి వస్తే.. పక్షపాతంగా ఉన్న పోలీస్‌ అధికారులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఎల్లకాలం కేసీఆరే అధికారంలో ఉండడని గుర్తుంచుకోవాలని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Related Posts