Highlights
- టీడీపీ వైఖరిపై చర్చ.
- ఏపీ అధ్యక్షుడిగా కంభంపాటి..?
- వ్యతిరేకత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు
- ఏపీ నేతలతో అమిత్ షా భేటీ..
టీడీపీ తమతో మిత్రత్వాన్ని తెగతెంపులు చేసుకున్న తర్వాత ఏపీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేక రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చించినట్టు సమాచారం. శనివారం అయన ఢిల్లీలో తమ పార్టీ ఏపీ నేతలతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ వైఖరిపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి చేసిన సాయం విషయాన్ని ప్రజలకు ఎలా వివరించి చెప్పాలన్న అంశంపై, ఏపీలో తమ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై అమిత్ షా సూచనలు చేస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబును కొనసాగించే అంశం కూడా చర్చకు వాచినట్టు సమాచారం.