YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆ ఐదెకరాలు మాకు వద్దు: ఒవైసీ

ఆ ఐదెకరాలు మాకు వద్దు: ఒవైసీ

ఆ ఐదెకరాలు మాకు వద్దు: ఒవైసీ
న్యూఢిల్లీ 
అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై  తాము సంతృప్తిగా లేమని ఐఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సుప్రీమే కానీ, అమోఘం కాదని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ఆఫర్ ను తిరస్కరించాలని అన్నారు. 'ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు. లీగల్ హక్కుల కోసమే తాము పోరాడామన్నారు. ఏఐఎంపీఎల్బీ వాదనతో తాము ఏకీభవస్తున్నామని చెప్పారు. 'వాస్తవాల మీద విశ్వాసాలే గెలిచాయి' అని తీర్పుపై స్పందించారు. తీర్పును సవాలు చేసే విషయంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Related Posts