YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

వడివడిగా రామాలయం  అడుగులు

వడివడిగా రామాలయం  అడుగులు

వడివడిగా రామాలయం  అడుగులు
లక్నో, నవంబర్ 11
సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ఇక రామాలయ నిర్మాణంపైనే హిందువుల దృష్టి కేంద్రీకృతమైంది. రామ మందిర నిర్మాణం పూర్తికావడానికి పట్టే సమయంపై చర్చ సాగుతున్నది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరి దృష్టి అయోధ్యలోని కరసేవపురంపై నెలకొంది. ఎందుకంటే 29 ఏళ్లుగా ఆలయ నిర్మాణానికి పనులు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రామజన్మభూమికి  ఒక కిలోమీటరు, వి.హెచ్.పి ఆఫీస్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రాళ్ల కటింగ్, శిల్పాల చెక్కడం, రాళ్లను శుభ్రం చేయడం తదితర పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం 12 మందే పనిచేస్తున్నా.. ఒకానొక సమయంలో రోజూ 200 మంది వరకూ పనుల్లో ఉన్నారు. ఈ పనుల్లో ఉన్నవారంతా రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన శిల్పులు. ప్రతీరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇక్కడ పనులు సాగుతున్నాయి.వాస్తవానికి  అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు 1989లో మొదలయ్యాయి. విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ ధార్మిక సంస్థల ఈ అంశంలో చొరవ తీసుకున్నాయి. 1989 ఏడాది చివరిలో రాజస్థాన్ నుంచి 2 ట్రక్కుల్లో మార్బుల్ రాళ్లను అయోధ్యకు తీసుకొచ్చారు.  ఆ తర్వాత 1991లో ఆలయ నిర్మాణంపై  స్పష్టమైన ప్రకటన చేసింది విశ్వహిందూ పరిషత్. రాజస్థాన్లోని భరత్పూర్ సమీపంలోని బాన్సిపహార్ నుంచి గ్రానైట్, మార్బుల్, పాలరాయిని తెప్పించింది. రామమందిరం నిర్మాణంలో జాతిని భాగస్వామ్యం చేసేందుకు  రామ శిలల పేరుతో.. శ్రీరాముడు పేరు చెక్కిన, రాసిన ఇటుకలు, ఇతర సామాగ్రిని తరలించారు. ఇలా 29 ఏళ్లుగా సాగుతున్న పనులవల్ల  రామాలయం గ్రౌండ్ ఫ్లోర్కు కావాల్సిన వాటిల్లో 70 శాతం వరకూ సిద్ధమయ్యాయి. రోజుకు 250 మంది శిల్పులు ఏకధాటిగా పనిచేస్తే ఒకటి రెండు నెలల్లో తొలి ఫ్లోర్ పనులు మొదలు పెట్టొచ్చనేది ఈ వర్క్స్ను పర్యవేక్షిస్తున్న వారి మాట. ప్రస్తుతం సగటునా 12 మంది పనిచేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు కోసం మూడు రోజులుగా పనులు ఆపేశారు. ఇప్పుడా పనులు వేగం పుంజుకోబోతున్నాయ్. సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఎన్నాళ్లలో పూర్తవుతుందనేది ప్రశ్న. 2023లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. నిర్మాణానికి అవసరమైన ముడిసరుకు చాలా వరకూ సిద్ధమై ఉంది. వన్స్ పనులు ప్రారంభమైతే నాలుగేళ్లలో మందిర నిర్మాణం పూర్తి చేయవచ్చనేది కొందరి వాదన. మరోవైపు, రామ మందిరాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) 1984 నుంచే అయోధ్యలో పనులు ప్రారంభించింది, విరాళాల్ని సేకరించింది. పనులు కొంతవరకు పూర్తయ్యాయి. వీహెచ్పీ ఆలయ నమూనా ప్రకారం.. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే మరో ఐదేండ్ల సమయం పడుతుందని, ఈ నిర్మాణం కోసం 250 మంది నిపుణులైన శిల్పులు నిరాటంకంగా పనిచేయాల్సి ఉంటుందని మందిరం పనిప్రదేశం పర్యవేక్షకుడు అన్నుబాయ్ సోంపురా తెలిపారు. 1990 నుంచి ప్రతిరోజూ ఎనిమిది గంటల చొప్పున వీహెచ్పీ కార్యశాలలో రామమందిరం పనులు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకూ సగం నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు కష్టపడితే ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి. మందిరానికి కావాల్సిన మొత్తం 212 పిల్లర్లకు గానూ 106 పిల్లర్లే సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం ఇవి ఆలయం పని ప్రదేశంలో ఉన్నాయి. వీహెచ్పీ కార్యశాలలోని ప్రముఖ శిల్పి రజినీకాంత్ సోంపురా గత జూలైలో మరణించారు. ప్రస్తుతం వీహెచ్పీ కార్యశాలలో శిల్పులు ఎవరూ లేరు. ‘ప్రస్తుతం పని ప్రదేశంలో కూలీలెవరూ లేరు. మందిరం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తే.. మాకు కనీసం 250 మంది శిల్పుల అవసరం ఉంటుంది.ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఐదేండ్ల సమయం పడుతుంది’ అని అన్నుబాయ్ సోంపురా అన్నారు. ఇప్పటికైతే ఆలయం గర్భగుడి గోడలు, గుడిలో దైవం, గుడి తలుపుల ఫ్రేములతో పాటు సగం ఫిల్లర్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 106 ఫిల్లర్లతో పాటు ఆలయ శిఖరం, పైకప్పు నిర్మించాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. ్ర1984లో ఆలయం నిర్మాణం కోసం వీహెచ్పీ ఆధ్వర్యంలో పునాది వేశారని, మందిరం నిర్మాణం కోసం భక్తుల నుంచి కనీసం ఒక్క రూపాయి 25 పైసల చొప్పున విరాళాలు సేకరించగా.. నిర్మాణం కోసం మొత్తం రూ. 8 కోట్లు సమకూరాయని వీహెచ్పీ కార్యాలయం అధికారులు తెలిపారు. మందిరం నిర్మాణం పనులు మొదలైన కొత్తలో 150 మంది శిల్పులు, వందలాది మంది కార్మికులతో పనులు వేగంగా జరిగాయని, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన రాళ్లతో కూలీలు నిర్మాణం పనుల్ని కొనసాగించారని.. అయితే, పదేండ్ల తర్వాత శిల్పులు, కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతూ పని నత్తనడకన సాగిందని వీహెచ్పీ ప్రముఖుడు శరద్ శర్మ పేర్కొన్నారు.

Related Posts