YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తహశీల్దార్ హసీనాబీ ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కూడా కేసులు ఏసీబీ అధికారుల హెచ్చరిక

తహశీల్దార్ హసీనాబీ ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కూడా కేసులు ఏసీబీ అధికారుల హెచ్చరిక

తహశీల్దార్ హసీనాబీ ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కూడా కేసులు
ఏసీబీ అధికారుల హెచ్చరిక
కర్నూల్ 
లంచం తీసుకుంటూ కర్నూల్ జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీ ఏసీబీ కి అడ్డంగా  దొరికింది.  దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం కాగా.. ఆ విషయం తెలుసుకున్న హసీనాబీ ఆ రోజు నుంచి పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.  ఏసీబీ కేసు లో హసీనాబీ ముద్దాయిగా ఉన్నారని ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారుల కి ఈ సమాజం లో ఒక గౌరవం ఉంది. కానీ కొంత మంది చేసే తప్పుడు పనుల వల్ల మొత్తం ప్రభుత్వ  ఉద్యోగుల కే చెడ్డ పేరు వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ  ఉద్యోగులు ..లంచం లేనిదే మంచం దిగరు అనే స్థాయికి వచ్చేసింది. ఎదో అవసరాల నిమిత్తం ప్రభుత్వ ఆఫీసుల కి వచ్చిన వారు లంచం ఇస్తే కానీ మీ పని కాదు అని కొంత మంది నిర్మొహ మాటంగా చెప్పేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ..ప్రభుత్వ ఉద్యోగులు ఎలా మారిపోయారు. ఆలా అని అందరూ లంచం తీసుకుంటున్నారు అని అనడంలేదు.లక్షణమైన జీతం ..సమాజం లో గౌరవం ..ఇన్ని ఉన్నా కూడా లంచానికి అలవాటు పడి కటకటాల పాలైన వారు చాలామంది ఉన్నారు. వారిని చూసైనా బుద్దితెచ్చుకోవాల్సిన అధికారులు ..మళ్ళీ అదే తప్పు చేసి జైలు కి వెళ్ళడాని కి సిద్ద పడుతున్నారు మరో వైపు హసీనా బీ ఆచూకీ కోసం పలు బృందాలు ముమ్మరం గా గాలింపు చర్యలను చేపడుతున్నాయి.

Related Posts