YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ అగ్రకుల పార్టీ- వైస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

టీడీపీ అగ్రకుల పార్టీ- వైస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

టీడీపీ అగ్రకుల పార్టీ
తాడేపల్లి నవంబర్  11:
టీడీపీ వెబ్ సైట్ ఈ పేపర్ లో స్పీకర్ ను కించ పరుస్తూ వార్త రాశారు. బలహీన వర్గాలు అంటే ఎందుకు చంద్రబాబు లోకేష్ లకు చిన్న చూపని వైస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. సోమవారం అయన మీడియాతో మట్లాడారు. ఈ పేపర్ లో మీరు వాడిన భాష సభ్య సమాజం తల దించుకొనేలా ఉంది. చంద్రబాబు లోకేష్ కు అగ్ర కుల ఆహకారం ఎక్కువ. ఆంబోతుల తింటాడు, దున్న పోతులా పడుకుంటాడు అని స్పీకర్ ను పట్టుకొని ఎలా రాస్తారు. స్పీకర్ స్థానాన్ని అవమాన పరచేలా ఎలా మాట్లాడుతారని అడిగారు. ఈ పేపర్ లో స్పీకర్ ను కించ పరచే వార్తలపై చంద్రబాబు లోకేష్ పై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు లోకేష్ స్పీకర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. లేదంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ పేపర్ లో స్పీకర్ పై రాసిన వార్తలపై చంద్రబాబు లోకేష్ ను వదిలి పెట్టేది లేదు. స్పీకర్ పై రాసిన వార్తలపై సీఎం, గవర్నర్ ను కలిసి పిర్యాదు చేస్తామని అన్నారు. బలహీన వర్గాలు అంటే చంద్రబాబు ఇష్టం ఉండదు. తమ్మినేనిని స్పీకర్ గా ఎన్నిక చేస్తే చంద్రబాబు దూరంగా ఉన్నారు. బలహీన వర్గాలకు చెందిన వారు స్పీకర్ గా ఉంటే చంద్రబాబు తట్టుకోలేకపోయారు. స్పీకర్ వ్యవస్థ ను టీడీపీ నేతలు మంట కలుపుతున్నారని ఆరోపించారు. స్పీకర్ మీద పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ పై ఎందుకు వ్యక్తి గతంగా విమర్శలు చేస్తున్నారో అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సభను హుందాగా నడుపుతున్నారు. చంద్రబాబుది అగ్రకుల పార్టీ.  బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న టీడీపీ ని భూ స్థాపితం చేస్తామని హెచ్చరించారు. 

Related Posts