YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి దేశీయం

ఫీజుల పెంపు పై జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థుల ర్యాలీ  విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ న్యూఢిల్లీ

ఫీజుల పెంపు పై జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థుల ర్యాలీ  విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ న్యూఢిల్లీ

ఫీజుల పెంపు పై జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థుల ర్యాలీ 
           విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ
న్యూఢిల్లీ నవంబర్11 (న్యూస్ పల్స్):
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపుతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టూడెంట్స్‌ యూనియన్‌(జేఎన్‌యూఎస్‌యూ) ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీ క్యాంపస్‌ బయట పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. విద్యార్థినులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపారు. దీంతో పోలీసుల తీరుపైనా వారు తీవ్రంగా నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో జేఎన్‌యూ ప్రాంగణం దద్ధరిల్లుతోంది. విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. గేటువైపు దూసుకొస్తున్న కొంతమంది విద్యార్థులను పట్టుకొని పోలీసులు చితకబాదారు.

Related Posts