YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

 హైకోర్టు విచారణ వాయిదా

 హైకోర్టు విచారణ వాయిదా

 హైకోర్టు విచారణ వాయిదా
హైద్రాబాద్, నవంబర్ 11, 
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీర్మానాన్ని ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు వివరించింది. విధుల్లో చేరండి..లేకపోతే లేదని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించింది. చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని బలవంత పెట్టే అధికారం మాకెలా ఉంటుందని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది

Related Posts