YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం జ్ఞానమార్గం దేశీయం

కార్తీక పౌర్ణమి వేళ అపశ్రుతి.. ఆరుగురు మృతి బీహార్

కార్తీక పౌర్ణమి వేళ అపశ్రుతి.. ఆరుగురు మృతి బీహార్

కార్తీక పౌర్ణమి వేళ అపశ్రుతి.. ఆరుగురు మృతి
బీహార్ నవంబర్ 12 
కార్తీక పౌర్ణమి వేళ మంగళవారం అపశ్రుతి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవాడ జిల్లాలోని కోవకల్ దేవాలయం వద్ద నదిలో స్నానమాచరించేందుకు వచ్చిన భక్తుల్లో ఆరుగురు మునిగి మరణించారు. ఐదుగురు పిల్లలతోపాటు ఓ వ్యక్తి కాపాడబోయి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించారు. ఐదుగురు పిల్లలు నదిలోకి దూకి ఈత రాక మునిగిపోయారు. పిల్లల్ని రక్షించేందుకు అవినాష్ కుమార్ అనే వ్యక్తి నదిలోకి దిగి ఆయన మృత్యువాత పడ్డారు. నలంద జిల్లా పావాపురి ప్రాంతంలోని సక్రి నదిలో మునిగి ముగ్గురు పిల్లలు మరణించారు. మరో ఘటనలో అనూరాథ(18), శిల్పి (18)లు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

Related Posts