YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాసలో చేరికలు

తెరాసలో చేరికలు

తెరాసలో చేరికలు
నర్సంపేట నవంబర్ 12
 నియోజకవర్గ  అభివృద్దే లక్ష్యంగా జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు నచ్చి టీఆరెస్ లో చేరికలు ఊపందుకున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 9వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ ఉపాధ్యక్షులు  వేల్పుగొండ రాజు, 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కమూడి సూరితో పాటు 9వ, 5వ వార్డులకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆరెస్ లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమన్న ఆయన చేరిన ప్రతీ కార్యకర్త పార్టీ నియమ నిభందనలకు లోబడి పార్టీ పటిష్టానికి, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేల్పుగొండ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్దిలో పాలు పంచుకుంటామన్నారు. ఎస్సీ కాలనీ అభివృద్దిని ఆకాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, కాలనీ అభివృద్దికి, నిరుపేదల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి, మౌళిక వసతుల పనుల ప్రక్రియను వేగవంతం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నాయకులు రాయుడి రవీందర్ రెడ్డి, నాయిని నర్సయ్య, నాగేల్లి వెంకట నారాయణ గౌడ్, నల్ల మనోహర్ రెడ్డి, మునిగాల వెంకట రెడ్డి, యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి,
గుంటి కిషన్, ఇతర మాజీ కౌన్సిలర్లు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts