YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సాయిరెడ్డిపై బుద్ద వెంకన్న ధ్వజం

సాయిరెడ్డిపై బుద్ద వెంకన్న ధ్వజం

సాయిరెడ్డిపై బుద్ద వెంకన్న ధ్వజం
విజయవాడ నవంబర్ 13
దొంగ దీక్షలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్. దొంగ దీక్షలకు పేటెంట్ రైట్స్ వైకాపా పార్టీకే ఉన్నాయని  టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. బుధవారం అయన ట్వీట్టర్ లో వ్యాఖ్యానించారు. దొంగ దీక్షల బెస్ట్ డైరెక్టర్ గా మీకు అవార్డు కూడా వచ్చింది కదా విజయసాయి రెడ్డి. పెద్ద రోగంతో పోయిన వాడు మా నాన్న కోసమే పోయాడు అంటూ బుగ్గలు నిమరడం, బిల్డ్ అప్ సాంగ్స్, గ్రాఫిక్స్ లో జనం, ఏసీ బస్సులో మేత అంతా బహిరంగ రహస్యమే కదా సాయి రెడ్డి అని నిలదీసారు. మీ చరిత్రలో మీ సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా ? భవన నిర్మాణ కార్మికుల కష్టాలు,ఆత్మహత్యల పై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ అని విమర్శించారు. 

Related Posts