YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

పీఠాధిపతుల చేతుల మీదుగా వాల్మీకి మహర్షి విగ్రహం ప్రతిష్ఠాపన

పీఠాధిపతుల చేతుల మీదుగా వాల్మీకి మహర్షి విగ్రహం ప్రతిష్ఠాపన

పీఠాధిపతుల చేతుల మీదుగా వాల్మీకి మహర్షి విగ్రహం ప్రతిష్ఠాపన
భారీ సంఖ్యలో పీఠాధిపతులు, నాయకులు, ప్రజలు
కౌతాళం
 కౌతాళం మండల కేంద్రంలో బొడ్డు రాయి దగ్గర  అంగ రంగ వైభోవంగా అతిరథుల మహా పీఠాధిపతుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠపాన జరిగింది. ఈ విగ్రహం ప్రతిష్ఠాపన ప్రదీప్ రెడ్డి,దేశాయి కృష్ణ,దివాకరరెడ్డి ఉలిగయ్య ,  టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.నాయకులకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. పూలమాలలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ పానకు పీఠాధిపతులు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడవాలని హితవుపలికారు. ఈ వాల్మీకి విగ్రహ ప్రతిష్టపనకు నాయకులకు మెమోలు అందజేశారు.మహిళలు వాల్మీకి మహర్షి కి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు పట్టారు. కౌతాళం అంత పండుగ వాతావరణం నెలకొంది. విగ్రహా ప్రతిష్ఠాపన వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమలు నిర్వహించి ఫల ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమలు అంత గ్రామ పెద్దలు ముసలయ్య, గొట్టయ్య, గిరి, దొడ్డయ్య, తదితరులు నిర్వహించారు. విగ్రహా ప్రతిష్ఠాపన కు  వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts