YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలి టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలి టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలి
టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు 
అమరావతి 
భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే రేపటి దీక్ష. విజయవాడలో రేపటి 12 గంటల నిరసన దీక్ష సక్సెస్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లా మండల పార్టీ నాయకులు పాల్గోన్నారు.  చంద్రబాబు మాట్లాడుతూ రెండు జిల్లాల నుంచి భారీగా తరలిరావాలి. ఇసుక కృత్రిమ కొరతను వైసిపి నేతలే సృష్టించారు. శాండ్ మాఫియాగా ఏర్పడి దోపిడి చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని అడ్డుకున్నారు.  ఈ కష్టం, ఇంత నష్టం గతంలో లేదు.  5నెలల్లో 50మంది కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్ర చరిత్రలో లేవని అన్నారు. పనుల్లేక ఎన్నో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి.  అనేకమంది అప్పుల పాలయ్యారు. ఇంత పెద్దఎత్తున ఆత్మహత్యాయత్నాలు గతంలో ఎన్నడూ లేవు. టార్గెట్లు పెట్టుకుని వైసిపి నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, సిమెంటు,మద్యం,వర్కులు అన్నింటిలో దోపిడి. వ్యాపారాలు చేయాలంటే, ఆస్తులు అమ్మాలంటే ‘జె ట్యాక్స్’ కట్టాలి. కార్మికుల కష్టాల్లో అందరూ అండగా ఉండాలి. కార్మికుల కుటుంబాలకు సంఘీభావంగా చూపాలి.  వివిధ ప్రాంతాలనుంచి ర్యాలీగా దీక్షకు తరలిరావాలి.  కార్మికులకు సంఘీభావంగా ర్యాలీలు జరపాలి.  అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నిలిపేశారు. సింగపూర్ కన్సార్షియంతో ఎంవోయూ రద్దు చేశారు.  ఏపి అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతం. రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేశారు. రాష్ట్రంలో అన్నిప్రాజెక్టుల పనులు ఆపేశారు.
ప్రభుత్వ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం. రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేస్తున్నారు. ఇష్టానుసారం చేయడానికి ఇది నిరంకుశత్వం కాదని అయన అన్నారు. ప్రజాకంటక పార్టీగా వైసిపి మారింది. ప్రజల పట్ల బాధ్యతగల పార్టీ తెలుగుదేశం. 37ఏళ్లుగా టిడిపి పేదలకు అండగా ఉంటోంది. 22ఏళ్ల అధికారంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసింది.  ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతోంది. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం కృషి. రాష్ట్రంలో తక్షణమే ఇసుక ఉచితంగా ఇవ్వాలి.  సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలి. 
పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలి.  పనులు కోల్పోయినవారికి నెలకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని అయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి. 12 గంటల నిరసన దీక్షలో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలి.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని అయన పిలుపునిచ్చారు.

Related Posts