YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ప్రభుత్వం మతమార్పిడులకు పాల్పడుతోంది : కిషన్ రెడ్డి

జగన్ ప్రభుత్వం మతమార్పిడులకు పాల్పడుతోంది : కిషన్ రెడ్డి

జగన్ ప్రభుత్వం మతమార్పిడులకు పాల్పడుతోంది : కిషన్ రెడ్డి
విశాఖపట్టణం, నవంబర్ 13, 
జగన్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందని.. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. బీజేపీ కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ దాడులు చేస్తోందని ఫిర్యాదు అందాయన్నారు. ఇలాంటి కక్షసాధింపు ధోరణి సరికాదన్నారు. ఏపీలో అన్యమత ప్రచారం జరుగుతోందని.. బలవంతపు మతమార్పిడులు మంచిది కాదన్నారు కిషన్‌రెడ్డి. విశాఖలో పర్యటించిన కిషన్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడారు.. తాజా పరిణామాలపై స్పందించారు.వెంకయ్యనాయుడుపై సీఎం జగన్ వ్యాఖ్యలు సరికాదని.. ఎక్కడైనా మాతృ భాషను కాపాడుకోవాలి అన్నారు కిషన్ రెడ్డి. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అమృత్ పథకం కింద విశాఖకు నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతోందని.. మహారాష్ట్రలో పొత్తు ధర్మానికి శివసేన తూట్లు పొడిచిందని వ్యాఖ్యానించారు.బుధవారం ఉదయం కిషన్ రెడ్డి విశాఖ బీచ్‌లో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీచ్‌‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. ప్రజలు స్వచ్ఛభారత్‌ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు కిషన్ రెడ్డి. ప్లాస్టిక్‌ నియంత్రణకు కృషి చేస్తామని.. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితోనే స్వచ్ఛ బీచ్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Related Posts