YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మూడు కీలక కేసులు.. సుప్రీంలో తీర్పులు శబరిమలైపై  క్లారిటీ ఇవ్వనున్న న్యాయస్థానం

మూడు కీలక కేసులు.. సుప్రీంలో తీర్పులు శబరిమలైపై  క్లారిటీ ఇవ్వనున్న న్యాయస్థానం

మూడు కీలక కేసులు.. సుప్రీంలో తీర్పులు
శబరిమలైపై  క్లారిటీ ఇవ్వనున్న న్యాయస్థానం
రఫెల్ వివాదం, రాహుల్ చౌకీ దార్ కామెంట్స్ పై తీర్పులు
తిరువనంతపురం, నవంబర్ 13, 
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు, హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో రివ్యూ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై మొత్తం 56 పిటిషన్ల దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ రోహిటన్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హొత్రాలతో కూడి ధర్మాసనం ధర్మాసనం గురువారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శబరిమలలో 10 వేల మంది పోలీసులను మోహరించారు. గతేడాది తీర్పు తర్వాత శబరిమలలో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. గతేడాది ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.ఫిబ్రవరి 6న రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కే పరాశరన్‌ విజ్ఞప్తి చేశారు.ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా కేవలం 10 నుంచి 50 ఏళ్ల మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదని, ఇది అంటరానితనం కిందకు రాదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రివ్యూ పిటిషన్‌లను తాము వ్యతిరేకిస్తున్నామని కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్ జైదీప్‌ గుప్తా కోర్టుకు నివేదించారు.రివ్యూ పిటిషన్‌ల రూపంలో కేసును తిరిగి చేపట్టలేరని, మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో సమాన హక్కును నిరాకరించే పద్ధతి ఏదైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25కు విరుద్ధమని వాదించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని, సమీక్షించరాదని తాము నిర్ణయం తీసుకున్నామని ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం బోర్డు లాయర్ రాకేష్‌ ద్వివేది సుప్రీం బెంచ్‌కు నివేదించారు.ఇది విస్తృత ప్రజాబాహుళ్యానికి సంబంధించిన అంశం కాదని, ఓ వర్గం అంతర్గత వ్యవహారమని, వారి విశ్వాసానికి సంబంధించిందని సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నపాడే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మతపరమైన పద్ధతులను ఎవరూ నిర్ధేశించలేరని, ఆ వర్గానికి చెందిన సభ్యులే దాన్ని నిర్ణయిస్తారని, సుప్రీం తీర్పు అనంతరం కేరళలో నెలకొన్న సామాజిక అశాంతిని మనమంతా మీడియాలో చూశామని చెప్పారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Related Posts