YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

శ్రీదేవిని సన్నిహితులే హత్య చేశారు..

Highlights

  • టీఆర్ఎస్ కి మరోసారి అధికారం  
  • ఏపీ, తెలంగాణల్లో బీజేపీ ఖాళీ..
  • రజినీకాంత్ రాణిస్తారు.. 
  • ప్రముఖుల జాతకాలు..
  • పంచాంగ శ్రవణంలో పేర్కొన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయ సిద్ధాంతి
శ్రీదేవిని సన్నిహితులే హత్య చేశారు..

ఇటీవల దుబాయ్ లో దుర్మరణం చెందిన అందాల రాశి  సినీ నటి శ్రీదేవిని ఆమె సన్నిహితులే హత్య చేశారని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్‌ స్పష్టం చేశారు. విళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ హత్యేనన్నారు.

ఇక రాజకీయాల్లో అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాణిస్తాడని ములుగు సిద్ధాంతి పంచాంగ శ్రవణంలో వివరించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న ఎన్నికల్లో  ఏపీ, తెలంగాణలలో  ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదని తేల్చి చెప్పారు. అయితే ఈ ఏడాది డిసెంబరులోగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీకి అనుకూల ఫలితాలు వస్తాయన్నారు.  గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలలో బీజేపీ ప్రాభవం బాగా తగ్గుతుందని, ఆ పార్టీ సగానికి సగం సీట్లు కోల్పోతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ మరోమారు అధికారంలోకి వస్తుందని చెప్పారు.
 

Related Posts