YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పంచభూతాలను దోచుకున్న టీడీపీ

పంచభూతాలను దోచుకున్న టీడీపీ

పంచభూతాలను దోచుకున్న టీడీపీ
విజయవాడ
తెలుగుదేశం పార్టీ నాయకులు పంచభూతాలను దోచుకున్నారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలు. చంద్రబాబు చంద్రబాబు వేల కోట్ల రూపాయల దోచుకున్నారు. వరదలతో కొంత కొరత ఉన్న మాట వాస్తవమని వైకాపా ఎమ్మెల్యే పార్ధదసారధి అన్నారు. లక్షా యాభై వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నాం ప్రస్తుతం. రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక దొంగ దీక్షలు చేస్తున్నారు చంద్రబాబు. అచప పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించమంటే చంద్రబాబు పారిపోయాడు. చంద్రబాబు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూచంద్రబాబు కి దీక్షలు చేసే అర్హత లేదు. ఇసుక దోపిడీ అడ్డుకున్న అధికారులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు. చంద్రబాబునాయుడు హయాంలోనే రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది. బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా కృత్రిమ ఇసుక కొరత సృష్టించారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ సంస్థ ద్వారా ఇసుక వెబ్ సైట్ ను హ్యాక్ చేసారని అన్నారు. బ్లూ క్రాస్ సంస్థ అనేది చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లో నడిచే సంస్థ. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చంద్రబాబుకు మొన్న ప్రజలు ఇచ్చిన చార్జిషీట్లో 23 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావు. దేవినేని ఉమా పెద్ద ఇసుక మాఫియా కింగ్. చంద్రబాబు దీక్ష చేయడం దెయ్యాలు వేదాలు వల్లం చడమేనని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబుకు వంద కోట్ల రూపాయలు జరిమానా బుద్ధి రాలేదు. చంద్రబాబు ఇంటి పక్కనే రోజు వందల కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా జరిగేది.డ చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక కుంభకోణాలపై కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయని అన్నారు.

Related Posts