YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఎమ్మార్వో కార్యాలయాలకు పోలీసు భద్రత

ఎమ్మార్వో కార్యాలయాలకు పోలీసు భద్రత

ఎమ్మార్వో కార్యాలయాలకు పోలీసు భద్రత
యాదాద్రిభువనగిరి 
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయానికి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.  ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చే రైతులను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా లగేజీ బ్యాకులతో వస్తున్న వ్యక్తులను పోలీసులు చెక్ చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సజీవ దహనం చేసిన ఘటన నేపథ్యంలో అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయానికి కూడా భద్రత కల్పించారు పొలీసులు

Related Posts