YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తుంటే వైసీపీ మైండ్ గేమ్‌ ఆడుతోంది

చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తుంటే వైసీపీ మైండ్ గేమ్‌ ఆడుతోంది

చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తుంటే వైసీపీ మైండ్ గేమ్‌ ఆడుతోంది
అమరావతి 
: టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తుంటే వైసీపీ మైండ్ గేమ్‌లో భాగంగా ఎమ్మెల్యే వంశీతో ప్రెస్ మీట్ పెట్టించిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.ఇదే వంశీ గతంలో వైస్సార్‌ను జగన్‌ను ఏమన్నారో.. నాడు -నేడు రికార్డ్‌లు చూడాలని పేర్కొన్నారు. నేడు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో చంద్రబాబు తాజా పరిణామాలపై సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. బిల్డ్ ఏపీ పేరుతో విలువైన ప్రభుత్వ భూములను వైసీపీ నేతలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని రామానాయుడు ఆరోపించారు.ఇప్పటికే గ్రామ వలంటీర్ల రూపంలో వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ధనంతో జీతం ఇచ్చి మరీ నియమించుకుంటున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగాలను సైతం వైసీపీ వారికే కట్టబెట్టారని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మంత్రులు దందాకు సిద్ధమయ్యారని... కానీ విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారన్నారు. పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే ఆయన పైన ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలకు దిగారన్నారు. 5 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎన్నడూ లేనంత వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.విపక్షాలు పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. లాంగ్ మార్చ్, ఇసుక కొరతపై నిరసన దీక్షకు, బీజేపీ నిరసన కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చారని రామానాయుడు పేర్కొన్నారు.

Related Posts