YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 ప్రాణం మీదకు సెల్ఫీ

 ప్రాణం మీదకు సెల్ఫీ

 ప్రాణం మీదకు సెల్ఫీ
నిజామాబాద్,
సెల్ఫీ పిచ్చి ఒక్కోసారి యువత ప్రాణాల మీదకు తెచ్చి పెడుతోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన అలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడు సరదాగా మొబైల్‌లో ఓ ఫోటో తీసుకునేందుకు చేసిన ప్రయత్నం మృత్యువు వరకు తీసుకెళ్లింది. బ్రేక్ డ్యాన్స్ మిషన్ పైనుంచి కిందపడి ప్రాణాలు పోయినంత పని అయ్యింది.. తీవ్ర గాయాలతో ఆస్పత్రి చేరాల్సి వచ్చింది.జయరాజ్ అనే యువకుడు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రం లింబాద్రిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి ఉత్సవాల జాతరకు వచ్చాడు. స్వామివారిని దర్శించుకొని.. అనంతరం జాతరలో స్నేహితులతో సరదాగా గడిపాడు. తర్వాత బ్రేక్ డ్యాన్స్ మిషన్‌‌ ఎక్కాడు.. ఆ ఉత్సాహంలో సరదాగా ఓ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. వెంటనే జేబులో నుంచి మొబైల్ బయటకు తీశాడు. బ్రేక్ డ్యాన్స్ మిషన్ నడుస్తుండగానే సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు.మిషన్ వేగానికి చేతిలో మొబైల్ జారిపోయింది.. జయరాజ్ కూడా పట్టు తప్పాడు. యువకుడు జారి రెండు మిషన్ల మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు.. స్నేహితులు అప్రమత్తమయ్యారు. మిషన్‌ను ఆపేసి.. అతడ్ని జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో జయరాజ్‌కు తీవ్ర గాయాలుకాగా.. హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు

Related Posts