YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కిడ్నాప్ ను చేధించిన పోలీసులు

కిడ్నాప్ ను చేధించిన పోలీసులు

కిడ్నాప్ ను చేధించిన పోలీసులు
హైదరాబాద్ 
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం  కిడ్నాప్ కు గురైన బాలుడిని పోలీసులు క్షేమంగా తీసుకువచ్చారు. బాలుడి  పేరు గుర్రం అర్జున్. ఏడు సంవత్సరాల ఆర్జున్ టీఎస్ఆర్ స్విమ్మింగ్ ఫుల్ దగ్గర ఆడుకుంటున్నప్పుడు ఒక మైనర్ నిందితుడు కిడ్నాప్ చేసాడు. నిందితుడు 10 వ తరగతి చదువుతున్నాడు.. గతంలో కూడా అతడు  లక్ష రూపాయలు దొంగతనం చేశారు. కేసు విషయంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు మైనర్ అయినా కేర్ అండ్ ప్రోటాక్షన్ యాక్ట్ ప్రకారం..మేజర్  ఆఫన్డర్ గా నిర్ధారించి కోర్టు లో ప్రవేశ పెడుతామని అన్నారు. కిడ్నాప్ గురైన బాలుడు అర్జున్ తండ్రి రాజు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అర్జున్ ని కిడ్నాప్ చేసిన తర్వాత నిందితుడు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. 25 వేల నగదు, 2 లక్షల 75 వేల చెక్ ఇస్తే వదిలి పెడతానని అర్జున్ తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. మీర్ పేట్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ బాలుడిని పట్టుకున్నారని అన్నారు. కిడ్నాపర్ బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కి తరలించామని అయన అన్నారు. 

Related Posts