YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
హుస్నాబాద్ 
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో యువకుడు వేముల అఖిల్ (23) మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులతో కలిసి కరెంట్ షాక్ తో చేపలను పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. సర్విస్ వైర్ ను విద్యుత్ తీగలకు తగిలించి నీటిలో వదులుతుండగా ప్రమాదవశాత్తు షాక్ కు గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు యువకులు అతనిని బయటకు తీసి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి గ్రామస్తులు పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి రెండు నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు యువకుడు విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Posts