YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

భారత రాజకీయాల్లో పెద్దల సభ పాత్ర ప్రశంసనీయం

భారత రాజకీయాల్లో పెద్దల సభ పాత్ర ప్రశంసనీయం

భారత రాజకీయాల్లో పెద్దల సభ పాత్ర ప్రశంసనీయం
న్యూఢిల్లీ, 
రాజ్యసభ 250వ సమావేశాలను పురస్కరించుకుని ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. భారత రాజకీయాల్లో పెద్దల సభ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. భారత సమాఖ్య వ్యవస్థకు రాజ్యసభ ఆత్మవంటిదని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 250వ సమావేశం అంటే కేవలం సంఖ్య మాత్రమే కాదని, ఇదో అందమైన ప్రయాణమని అభివర్ణించారు. ఈ మహోన్నత ఘట్టంలో పాలుపంచుకునే అవకాశం తనకు దక్కడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ సభ చరిత్ర సృష్టించి, చరిత్రను చూసిందన్నారు. చరిత్రను మార్చడంలోనూ రాజ్యసభ కృషి అమోఘమని వ్యాఖ్యానించారు.రాజ్యసభ శాశ్వతం.. ఇది ఎప్పటికీ రద్దు కాదు... ఇక్కడకు సభ్యులు వస్తుంటారు.. వెళ్తుంటారు. లోక్‌సభ సభ్యులు క్షేత్రస్థాయి అంశాలను చూస్తే రాజ్యసభ దూరతీరాలను దూరదృష్టితో చూస్తుందన్నారు. మన దేశ సమాఖ్య విధానానికి ఈ సభ ఆత్మవంటిదని మోదీ కొనియాడారు. విభిన్న రంగాల్లో నిష్ణాతుల అనుభవాలు దేశానికి ఉపయోగడపడేలా రాజ్యసభ సహకరిస్తుందని, అందుకు అంబేడ్కరే ఉదాహరణ అని మోదీ అన్నారు.ఆలోచనలు, తీరు, విధానాలే ఉభయ సభల ఔన్నత్యాన్ని చాటిచెబుతాయన్న మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో అనేక కీలక ఘట్టాలకు రాజ్యసభ వేదికైందని, ట్రిపుల్ తలాక్, జీఎస్టీ వంటి బిల్లులు ఆమోదం పొందాయని అన్నారు. ఆర్టికల్‌ 370, 35ఏ బిల్లులకు సంబంధించిన విషయాల్లో రాజ్యసభ పాత్ర మరవలేనిదని మోదీ ప్రశంసించారు.రాజ్యసభ రెండో సభ అని 2003లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయీ అన్నారని, అయితే ఇది ద్వితీయశ్రేణి సభ కాదని మోదీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఎన్‌సీపీ, బిజు జనతాదళ్‌‌లపై ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంట్‌ నిబంధనలను ఈ రెండు పార్టీలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తనతో సహా అన్ని పార్టీల నేతలు వారిని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు.మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. రాజ్యసభలో 1991 నుంచి సభ్యుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో విపక్ష నేతగా..సభా నాయకుడిగా ఉండే అదృష్టం తనకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. సభలో ఏం చేయాలన్న విషయాలను అప్పటి ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తొలి సమావేశంలోనే చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో రెండో సభ ఎందుకు ఉండాలో రాజ్యాంగ పరిషత్ సభ్యుడు గోపాలస్వామి అయ్యర్ స్పష్టంగా తెలియజేశారని మన్మోహర్ తెలిపారు.ఉభయసభలూ ఒక వ్యవస్థలోని రెండు భాగాలని తొలి ప్రధాని నెహ్రూ చెప్పిన విషయాన్ని మన్మోహన్‌ గుర్తు చేశారు. చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌ విషయంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుందని.. లోక్‌సభతో పోల్చితే లోతైన చర్చకు రాజ్యసభలో అవకాశం ఉంటుందని అన్నారు. గత ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ జీరో అవర్, ప్రశ్నోత్తరాలను మార్చారని మన్మోహన్‌ సింగ్‌ వివరించారు.

Related Posts