YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం విదేశీయం

పాకిస్థాన్‌లో తెలుగోడు

పాకిస్థాన్‌లో తెలుగోడు

పాకిస్థాన్‌లో తెలుగోడు
హైద్రా బాద్, నవంబర్ 19 
పాకిస్థాన్‌లో తెలుగు యువకుడు ఒకరు అరెస్టవడం ఆందోళన కలిగిస్తోంది. కొలిస్థాన్ ఎడారిలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో భారత్‌కు చెందిన ఇద్దరు యువకులను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఉన్నాడు. వీరిద్దరూ పాస్‌పోర్టు, వీసా లేకుండా తమ భూభాగంలోకి ప్రవేశించారనేది పాక్ అభియోగం. వారిని భావల్‌పూర్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. పాక్‌లో పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ యువకుడి పేరు ప్రశాంత్ అని తెలుస్తోంది. అతడికి సంబంధించి ఓ వీడియోను రికార్డు చేసి విడుదల చేశారు. వీడియోలో యువకుడు చాలా ధైర్యంగా మాట్లాడటం గమనించవచ్చు. సదరు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.‘మమ్మీ, డాడీ బావున్నారా? ఇక్కడ అంతా బాగానే ఉంది. ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఏ సమస్యా లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇస్తారు. అప్పుడు మీతో సంభాషించడానికి అవకాశం కలుగుతుంది. ఒక నెల రోజుల్లో విడుదల కావొచ్చు’ అంటూ వీడియోలో ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.భారత్, పాక్ మధ్య ఖైదీల అప్పగింతల కార్యక్రమం ఉంటుందని.. అలా తాను విడుదల కావొచ్చని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఇండియన్ ఎంబసీకి సమాచారం అందిన వెంటనే బెయిల్ కోసం ప్రాసెస్ మొదలవుతుందని.. మరో నెల రోజుల్లో విడుదల అయ్యే అవకాశముందని తన తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు.పాక్ చెరలో ఉన్నప్పటికీ ఎలాంటి భయం, బెరుకూ లేకుండా మాట్లాడిన ప్రశాంత్ భారతీయుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ‘వీడియో రికార్డు చేస్తున్నారా.. నేను నా మాతృభాషలో మాట్లాడొచ్చా..’ అంటూ అతడు అధికారులను రిక్వెస్టు చేసి మాట్లాడటం ప్రారంభించాడు. చెప్పాల్సిన విషయం పూర్తి చేసిన తర్వాత అధికారులకు థ్యాంక్స్ చెప్పాడు.ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దారిలాల్.. పాక్ చెరలో ఉన్నాడు. వీరిరువురూ క్షేమంగా స్వదేశం తిరిగి రావాలని ప్రార్థిద్దాం..

Related Posts