YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు

రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు

రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు
కరీంనగర్ నవంబర్ 19 
చిగురుమామిడి: హైదరాబాద్ నగర శివారులో తహసీల్దార్ విజయారెడ్డిపై జరిగిన దాడి ఘటన మరవకముందే.. అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. హసీల్దార్ కార్యాలయంలో సిబ్బందిపై, కార్యాలయ కంప్యూటర్లపై రైతు పెట్రోల్ పోసిన ఘటన  ఇది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కార్యాలయ సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రోల్ చల్లాడు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది భూమి పట్టా చేయడం లేదని రైతు కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు  పట్టాలు ఇవ్వడం లేదంటూ సీనియర్ అసిస్టెంట్తోపాటు,  ఇతరసిబ్బందిపై పెట్రోలు పోశాడు. అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగానే పట్టాలు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి చెబుతున్నారు. పెట్రోల్ చల్లిన రైతును అదుపులోకి తీసుకున్నారు.

Related Posts