YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గుట్టలో ఆర్టీసీ సమ్మె

గుట్టలో ఆర్టీసీ సమ్మె

గుట్టలో ఆర్టీసీ సమ్మె
యాదాద్రి 
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 46వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులతో జేఏసీ నాయకులు సీక్రెట్ ఓటింగ్ నిర్వహించారు. సమ్మె కొనసాగించాలా.? వద్దా.? అనే విషయంపై సీక్రెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాన్ని సేకరించారు జేఏసీ నేతలు. ఓటింగ్ లో మొత్తం 127 మంది కార్మికులు పాల్గొనగా, 109 మంది సమ్మె కొనసాగించాలని ఓటు వేయగా, 13 మంది సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ అవుదామని ఓటు వేశారు. మరో ఐదుగురు తటస్థంగా ఉండి నోటాకు ఓటేశారు. దీంతో మెజారిటీ కార్మికుల అభిప్రాయం మేరకు సమ్మె కొనసాగించడానికి అనుకూలంగా ఉన్నారని జేఏసీ నేతలు తెలిపారు.

Related Posts