YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

నాగ్ పూర్ పర్యటనలో బల్దీయా బృందం

నాగ్ పూర్ పర్యటనలో బల్దీయా బృందం

నాగ్ పూర్ పర్యటనలో బల్దీయా బృందం
హైదరాబాద్ నవంబర్ 19
గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్లై ఒవర్ల నిర్మాణం, మెట్రో రైలు మార్గాల నిర్మాణం,రోడ్ల విస్తరణ వంటి అంశాల అధ్యయనం కోసం అదికారుల బృందం నాగపూర్ నగర పర్యటనకు వెళ్లారు. మేయర్ బోంతు రామ్మోహన్ అద్వర్యం లో అదికారుల బృందం నాగపూర్ నగరంలో  జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. నాగపూర్ ఎయిర్ పోర్టు నుంచి మెట్రో రైలు మార్గం లో   దేశంలోనే మొదటిసారిగా  నిర్మించిన రెండు  అంతస్తుల ఫ్లైఓవర్ మార్గాన్ని అదికారులు పరిశీలించారు. రోడ్ల నిర్మాణం లో తీసుకోవలసిన నాణ్యత ప్రమాణాలు.. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు తగినట్లు రోడ్ల విస్తరణ పనుల పై అదికారుల బృందం అధ్యయనం చేసింది.ఈ పర్యటనలో మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ జీహెచ్ఎంసి ఇంజనీయర్లు సురేష్ ,శీధర్,జీయావోద్దిన్ ఉన్నారు.

Related Posts