YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 జగన్ ఎమోషనల్ ట్వీట్

 జగన్ ఎమోషనల్ ట్వీట్

 జగన్ ఎమోషనల్ ట్వీట్
విజయవాడ, నవంబర్ 21  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. నవరత్నాలతో పాటూ కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం పథకాన్ని తూర్పుగోదావరిలో భించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.. తన ఆనందాన్ని అందరితో చుకున్నారు.‘దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000, డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు,వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తాం’అన్నారు జగన్.ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలను గుర్తించారు. వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నవంబర్‌ 21న మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ, వేట నిషేధ సమయంలో కుటుంబానికి రూ.10 వేల సాయం అందించనున్నారు. చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు ఆదాయం కోల్పోతారు.. ఆ సమయంలో పూట గడవడం కూడా వారికి కష్టం.. అందుకే రూ.10వేలు సాయం అందించనున్నారు. అలాగే చనిపోయిన మత్స్యకార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షలు ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచారు. మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

Related Posts