YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

2020-21కు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు ఆమోదించిన స్టాండింగ్ కమిటీ

2020-21కు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు ఆమోదించిన స్టాండింగ్ కమిటీ

2020-21కు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు ఆమోదించిన స్టాండింగ్ కమిటీ
హైదరాబాద్ 
  జీహెచ్ఎంసీ 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముసాయిదాను నేడు జరిగిన స్టాండింగ్ కమిటి ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ స్టాండింగ్ కమిటి సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై   పూర్తిస్థాయి చర్చఅనంతరం  స్టాండింగ్ కమిటి ఆమోదించింది. 2019 డిసెంబర్ 15న జనరల్ బాడిలో ప్రవేశపెట్టి 2020 జనవరి 10న పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. 2020 ఫిబ్రవరి 20వ తేదీన బడ్జెట్ను కార్పొరేషన్ ఆమోదించి 2020 మార్చి 7వ తేదీన తుది బడ్జెట్ ను ప్రభుత్వ ఆమోదం కోసం  పంపించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్టాండింగ్ కమిటికి తెలియజేశారు. స్టాండింగ్ కమిటి స. 2020-21 బడ్జెట్  వివరాలు...
2019-20 ఆమోదిత బడ్జెట్ రూ. 6150 కోట్లు
2019-20 సవరించిన బడ్జెట్ మొత్తం రూ. 5254 కోట్లు
2020-21కు ప్రతిపాదిత ముసాయిదా బడ్జెట్ మొత్తం రూ. 5380 కోట్లు
మేజర్ ప్రాజెక్ట్లకు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ. 1593 కోట్లు

Related Posts