YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మేం తలచుకుంటే...టీడీపీఖాళీ

మేం తలచుకుంటే...టీడీపీఖాళీ

మేం తలచుకుంటే...టీడీపీఖాళీ
న్యూఢిల్లీ, 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ ఎంపీలు చెప్పారు.సీఎం జగన్‌ అనుకుంటే అర్థగంటలో అందరూ వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేస్తారు. కానీ అటువంటి పనులకు తమ నాయకుడు దూరం. బీజేపీతో వైఎస్సార్ సీపీ  ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలి. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఇంకా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయిదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి టీడీపీకి కనిపించడం లేదా?. ఇసుక అమ్ముకుని బతికిన ఘటన టీడీపీది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజలంతా జగన్‌ పాలన శభాష్‌ అంటున‍్నాసుజనా చౌదరి ఎవరూ అంటే బ్యాంక్‌ దొంగ అని అందరూ అంటారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసినా బ్యాంక్‌ దొంగ అనే వస్తుంది. ఆయన తన పబ్బం గడుపుకోవడానికి వైఎస్సార్‌ సీపీ ఎంపీలపై నిందలు వేస్తున్నారు. బ్యాంకులకు రూ.6 వేలకోట్లు ఎగ్గొట్టిన దానిపై సుజనా చౌదరి మాట్లాడాలి.  మా కొన ఊపిరి ఉన్నంతవరకూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటాం. ఏ మాత్రం స్తోమత లేని మమ్మల్ని ఎంపీలుగా వైఎస్‌ జగన్‌ గెలిపించారు.  మాపై పత్రికల్లో అన్యాయంగా, అక్రమంగా, అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. రాధాకృష్ణ పేపర్‌ సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేయొద్దు  అని హితవు పలికారు

Related Posts