YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

చెన్నమనేనికి కోర్టులో ఊరట

చెన్నమనేనికి కోర్టులో ఊరట

చెన్నమనేనికి కోర్టులో ఊరట
హైద్రాబాద్, 
టీఆర్‌ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌‌కు హైకోర్టులో ఊరట అభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కేంద్రం ప్రభుత్వ ఉత్తర్వులను 4 వారాల పాటు నిలిపివేస్తూ న్యాయస్థానం శుక్రవారం (నవంబర్ 22) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేసింది.చెన్నమనేని రమేశ్‌ భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ వేసింది. భారత్‌లో ఆయన ఎలాంటి అధికారాలు పొందడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా ఆయన భారత పౌరసత్వం పొందారని పేర్కొంది. భారత పౌరసత్వ చట్టం-1955‌లోని సెక్షన్‌ 10 ప్రకారం అయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.చెన్నమనేని రమేశ్‌ పారసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాన్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారించిన హైకోర్టు ఆ అంశం కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోంశాఖ 2010లో చెన్నమనేని పౌరసత్వం తేల్చడానికి ఎస్.కె. టాండన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులని.. తాను జర్మనీలో విద్యాభ్యాసం చేశానని, 1993లో జర్మనీ పారసత్వం పొందానని కమిటీ ముందు రమేశ్‌ తన వాదనలు వినిపించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ అయన పౌరసత్వం చెల్లదని న్పష్టం చేసింది. దీంతో 2017లో హోంశాఖ చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వాన్ని రద్దుచేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.విషయాన్ని తేల్చాల్సింది హోం శాఖేనని స్పష్టం చేస్తూ కోర్టు 2019 జులైలో అదేశాలిచ్చింది. హైకోర్టు అదేశాలతో 2019 అల్టోబర్‌ 31న ఇరు పక్షాలు తమ వాదనలను హోంశాఖ ముందు వినిపించాయి. వాదనలు పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేశ్‌ పారసత్వం రద్దు చేస్తూ నవంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది.భారతీయ పౌరసత్వం రద్దుపై చెన్నమనేని తాజాగా మరోసారి హైకోర్టును అశ్రయంచారు. కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ, చట్ట విరుద్ధమంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. భారత పౌరసత్వ చట్టం, సెక్షన్‌ 10(3)లోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేయాలంటూ జూన్‌ 10న న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను హోం శాఖ పట్టించుకోలేదని ఆరోపించారు.కేంద్రం కంటి తుడుపు చర్యగా పరిశీలించి ఆలోచనా రహితంగా నిర్ణయం తీసుకుందని చెన్నమనేని ఆరోపించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు చెన్నమనేని రమేశ్‌కు ఊరటనిస్తూ హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాల పాటు వాయిదా వేసింది

Related Posts