YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అజిత్ పవార్ ఒక ద్రోహి

అజిత్ పవార్ ఒక ద్రోహి

అజిత్ పవార్ ఒక ద్రోహి
ముంబాయి 
ఎన్సిపి నేత అజిత్ పవార్ మహారాష్ట్రకు ద్రోహం చేశారని శివసేన నాయకుడు సంజయ్ రవుత్ మండిపడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకూ అజిత్ పవార్ తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. హఠాత్తుగా ఆయన మాయమైపోయారని, తరువాత సూటిగా కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడలేకపోయారని రవుత్ చెప్పారు. అజిత్ హావభావాలు చూస్తుంటేనే అర్థమవుతోందని ఆయన చెప్పారు. అజిత్ను బిజెపి బెదిరించి లొంగదీసుకుందని ఆయన చెప్పారు. రాత్రినుంచి అజిత్ ఫోన్ స్వీఛాఫ్ అయిందని అయన అన్నారు. అజిత్ చేసిన పనిని మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికి క్షమించరని అయన అన్నారు. 

Related Posts