YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మృతి జైపూర్

ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మృతి జైపూర్

ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మృతి
జైపూర్ నవంబర్ 23  
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  రెండు మినీ బస్సులు ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందారు.  పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు,ఒక  చిన్నారి ఉన్నట్లు సమాచారం.  శనివారం వేకువజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  నాగోర్ జిల్లాలోని కుచామన్ పట్టణ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.  క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.  డ్రైవర్ నిద్రమత్తు,అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ముందు వెళుతున్న బస్సుకు ఒక ఎద్దు అడ్డం వచ్చింది. దాన్ని తప్పించడానికి డ్రైవర్ బ్రేకులు వేసాడు. దాంతో అదుపుతప్పిన వాహనం రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. వెనకనున్న బస్సు కుడా ఈ ఘటనతో అదుపుతప్పి ముందు బస్సును ఢీకొట్టింది.  పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులంతా మహారాష్ట్రలని లాతూరునుంచి హర్యానాలోని హిస్సార్ కు వెళుతున్నారు. 

Related Posts