YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఏవెరుహించెదరు అన్న పాటను నిజం చేసిన మహారాష్ట్ర  రాజకీయాలు .....

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఏవెరుహించెదరు అన్న పాటను నిజం చేసిన మహారాష్ట్ర  రాజకీయాలు .....

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఏవెరుహించెదరు అన్న పాటను నిజం చేసిన మహారాష్ట్ర  రాజకీయాలు .....
మహారాష్ట్రలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగింది. గంటల వ్యవధిలోనే సమీకరణాలు తారుమారు అయ్యాయి. ఎన్సీపీ, భారతీయ జనతా పార్టీ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఊహించని ఈ పరిణామాలు శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నాయి. శనవారం ఉదయం   ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండవసారి ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఫడ్నవీస్ తో ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేసాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ ను మోడీ అభినందించారు. 

Related Posts