YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 బీజేపి సంబరాలు

 బీజేపి సంబరాలు

 బీజేపి సంబరాలు
విజయవాడ నవంబర్ 23, 
మహారాష్ట్రలో ఫడ్నవిస్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కావడంతో  బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్సి స్వీట్స్ పంచుకున్నారు. పార్టీ నేత పురంధరేశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవిస్ కు శుభాకాంక్షలు. మహారాష్ట్రలో సుపరిపాలన అందిస్తారని మెజార్టీ సీట్లు బీజేపీకి ప్రజలు కట్టబెట్టారు. శివసేన బీజేపీకి నమ్మకం ద్రోహం చేసింది. ప్రజల నమ్మకాన్ని ఫడ్నవిస్ నిలబెడతారని అన్నారు. 
ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ శివసేన అధికార దాహంతో నమ్మక ద్రోహానికి పాల్పడింది. అద్భుతమైన పాలనను బీజేపీ మహారాష్ట్రలో అందిస్తుందని అన్నారు.సోము వీర్రాజు మాట్లాడుతూ తన స్వరూపనికి భిన్నంగా శివసేన వ్యవహరించింది. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికార దాహంతో చేతులు కలిపింది. పొత్తుల కారణంగా బీజేపీకి మహారాష్ట్ర లో బీజేపీకి సీట్లు తగ్గాయి.ప్రజలు మహారాష్ట్రలో బీజేపీనే కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సంఘటనా ప్రధాన కార్యదర్శి, సతీష్ జి,ఆంధ్రప్రదేశ్ సంఘటనా కార్యదరై మధుకర్ జి,తురగా నాగభూషణం గారు,కంభంపాటి  హరిబాబు, పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, రావెల కిషోర్ బాబు,పార్థసారథి,జయప్రకాష్ నారాయణ వల్లూరు,అడపా శివనాగేశ్వరరావు,అయ్యాజి వేమ ,యాళ్ల దొరబాబు, నగర అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్, భానుప్రకాష్ రెడ్డి, ఆర్డీ.విల్సన్,కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts