YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అనంతపురంలో దారుణం

అనంతపురంలో దారుణం

అనంతపురంలో దారుణం
అనంతపురం, నవంబర్ 23, 
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తోడబుట్టిన తమ్ముడిని అన్న తెగనరికిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్తి వివాదాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ్ముడి తల, మొండెంను వేరు చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన సంచలనం కలిగించింది. హత్యానంతరం అన్న అక్కడి పరారైనట్లు తెలుస్తోంది.డబ్బు వ్యామోహం దారుణాలకు దారితీస్తోంది. ఆస్తి కోసం సొంత తమ్ముడినే కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన రామాంజనేయులు, రాజ కుల్లాయప్ప(40) అన్నదమ్ములు. కొద్దికాలంగా వారిద్దరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. వివాదం చినికి చినికి తమ్ముడి హత్యకు దారితీసింది.ఆస్తి పంపకాల విషయంలో తేడాలు రావడంతో తమ్ముడు రాజ కుల్లాయప్పను ఎలాగైనా అంతమొందించాలని రామాంజనేయులు నిర్ణయానికి వచ్చాడు. తమ్ముడు కుల్లాయప్పను దారుణంగా నరికి చంపాడు. తల, మొండెం వేరు చేసి కిరాతకంగా హత్యచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే హత్య జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Related Posts