YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గవర్నర్‌తో  ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భేటీ

గవర్నర్‌తో  ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భేటీ

గవర్నర్‌తో  ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భేటీ
హైదరాబాద్‌ 
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. కొత్త రెవెన్యూ యాక్ట్‌, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. ప్రజలకు సత్వరమే సేవలు అందించేలా పటిష్ఠమైన రెవెన్యూచట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్న విషయం విదితమే. కొత్తగా తీసుకురానున్న రెవెన్యూచట్టంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులతో విస్తృతంగా చర్చించారు. కొత్తచట్టంతో భూ వివాదాలకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పడాలని, భూమి క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా అమ్మినవారి ఖాతానుంచి డిలీట్ అయి కొనుగోలుచేసిన రైతు ఖాతాలో జమకావాలని, ఇవన్నీ పట్టాదార్ పాస్‌పుస్తకంలో నమోదు కావాలి. తనకు సమస్య ఉన్నదని, తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలని, పహాణీలు కావాలని కార్యాలయాల చుట్టూ రైతు తిరిగే దుస్థితి పోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Related Posts