YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

రాణిగంజ్ డిపోలో కదం తొక్కిన కార్మికులు

రాణిగంజ్ డిపోలో కదం తొక్కిన కార్మికులు

 రాణిగంజ్ డిపోలో కదం తొక్కిన కార్మికులు
హైదరాబాద్ నవంబర్ 26 
సికింద్రాబాద్ లో ని రాణి గంజ్ డిపో వద్ద డిపో లో కి కార్మికులు ఒక్కసారి గా నినాదాలు, ప్ల కార్డ్ ల తో దూసుకుపోవడానికి ప్రయత్నించారు. తమ నిరసన తెలియజేస్తూ, ఆర్ టి సి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని  కార్మికులు,మహిళా కార్మికులు నినాదాలు చేసారు. అందోళనకారులను  అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
మరోవైపు,  మెహదీపట్నం బస్ డిపో కు చెందిన 49 ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసి గోషామహల్ గ్రౌండ్స్ కి తరలించారు. బస్ డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో కి వచ్చే దారిలో బారికేడ్లు  అమర్చి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి పంపించారు.

Related Posts