YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం సినిమా

సినీ హీరోలపై నోరు జారిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

సినీ హీరోలపై నోరు జారిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

తెలుగు హీరోలు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడటం చేయడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఎవరికైనా అవార్డు రాకపోతే రచ్చ రచ్చ చేస్తారని, భూమి, ఆకాశాలు బద్దలైనట్టు వ్యవహరిస్తారని, ఇంటర్వ్యూలపై ఇంటర్వ్యూలు ఇస్తారని, ఇక్కడ మా ఆంధ్ర ప్రజలకు రివార్డులు రావడం లేదంటారని అభిప్రాయం వ్యక్తం చేసారు. నిధులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామయ్యా, మీ కళ్లకు కనబడటం లేదా? ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? అంటూ మండిపడ్డారు. సంస్కారం అడ్డొస్తోందని లేకపోతే ఇంకా క్రూరంగా మాట్లాడేవాడినని ఆయన అన్నారు. ఏజీ బార్ అయిన హీరోలూ... మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మీది హాలీవుడ్ స్థాయి కాదని, హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే మీరు పనికొస్తారని తీవ్ర విమర్శలు చేశారు.  ప్రత్యేక హోదా కోసం పోరాడకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేసేస్తారంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా మౌనం వీడాలని ఆశించారు.

Related Posts