YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం దేశీయం

ఎస్వీబీసీ చైర్మన్‌ కోడుమూరు ఆలయ సందర్శన

ఎస్వీబీసీ చైర్మన్‌ కోడుమూరు ఆలయ సందర్శన

ఎస్వీబీసీ చైర్మన్‌ కోడుమూరు ఆలయ సందర్శన
కోడుమూరు(కర్నూలు):
కర్నూలు జిల్లా కోడుమూరులో పునర్నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) చైర్మన్‌ పృధ్వీరాజ్‌ మంగళవారం సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను ధర్మకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఆలయాన్ని పంచాయతన దేవతలు, అష్టాదశ శక్తి పీఠాలతో రాతికట్టడంతో అద్భుతంగా నిర్మించడం ఆనందదాయకమని అన్నారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ పదవి సాక్షాత్తు తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ఎద్దుల మహేశ్వరరెడ్డి, ధర్మకర్త పి.రాజశేఖర్‌, కమిటీ సభ్యులు పెనుమాడ కిరణ్‌, వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి, పెనుమాడ రమేష్‌, ఆలయ పురోహితులు నరసింహశాస్త్రి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts