YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఏపీ అభివృద్ది చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి

 ఏపీ అభివృద్ది చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి

 ఏపీ అభివృద్ది చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి
రాజమండ్రి నవంబర్ 26
ఏపీ అభివృద్ధి చెందాలంటే బిజేపి అధికారంలోకి రావాలని బిజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీని పటిష్టం చేసుకోవడానికి చాలామందిని చేర్చుకుంటామని,ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, పోర్టులు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, తీరప్రాంతాల అభివృద్ధికి 5లక్షల కోట్లు కేంద్రం మంజారుకు సిద్దంగా ఉందని చెప్పారు.అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నిర్మాణం చేస్తామని,ఏపీ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేసిన కమిటీ నిఫుణులు ఎవర్నీ కలవకుండానే నివేదికలు ఇచ్చేస్తుందని చెప్పారు.విశాఖకు ఇసుక సరఫరా లో చాలా రేటు పెంచేశారని,కానీ అదే ఇసుక వేలం వేస్తే 5వేల కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు.పంతానికీ పట్టింపులకు పోకుండా  పరిపాలన అభివృద్ధి జరగాలని ఆకాక్షించారు.ఇసుకలో వైట్ కాలర్ మాఫియా నడుస్తోందని,పరిపాలన అంటే పసుపుకుంకమ , నవరత్నాలే కాదని,బిజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.

Related Posts