YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సొంత జిల్లాపై జనసేనాని ఫోకస్

జగన్ సొంత జిల్లాపై జనసేనాని ఫోకస్

జగన్ సొంత జిల్లాపై జనసేనాని ఫోకస్
కడప, నవంబర్ 27  
జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. జనసేనాని డిసెంబర్‌ 1 నుంచి ఆరు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తారు.. చిత్తూరు, కడప జిల్లాల్లో షెడ్యూల్ ఉంటుంది. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారి ప్రతినిధులను పవన్‌ కళ్యాణ్‌ గారు ఈ పర్యటనలో కలుసుకొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారని ప్రకటనలో తెలియజేశారుజనసేనాని 1 మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు. 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి పయనమవుతారు.
2న ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3న కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పోటి చేసిన అభ్యర్దులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది. 4న మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రీణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడే బస చేసి.. 5న అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ తర్వాత స్టానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు.6న పార్టీ కార్యక్రమాలలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటారు. రాయలసీమ. జిల్లాల్లో జనసేన నాయకులూ, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులుపడుతున్నవారికి భరోసా ఇస్తారు. తర్వాత రాయలసీమ పర్యటన ముగించుకొని తిరుగు పయనమవుతారు. ఈ పర్యటనలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు

Related Posts