YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శాంతి భద్రతలు అదుపులో వున్నాయి

శాంతి భద్రతలు అదుపులో వున్నాయి

శాంతి భద్రతలు అదుపులో వున్నాయి
ఏలూరు నవంబర్ 27 :
బడుగు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయిలో సంక్షేమ ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలను అమలు చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాంగ ఫలాలను సంపూర్ణంగా అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని, గతంకంటే నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువత పెడదోవ పట్టకుండా మాదక ద్రవ్యాలు వంటి వాటి రవాణా, తయారీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం సైబర్‌, మహిళా మిత్రలతో పాటు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినట్లు వివరించారు.

Related Posts